delhi clashes: ఢిల్లీ పరిస్థితిపై ప్రధాని మోడీకి అజిత్ దోవల్ వివరణ,? కేంద్ర వర్గానికి కూడా

Politics Published On : Wednesday, February 26, 2020 10:53 AM
ఢిల్లీలో పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగిన ఆయన జాఫ్రాబాద్, సీలంపూర్ ప్రాంతంలో పర్యటించారు. అల్లరిమూకలు ఎక్కడ నక్కి ఉన్నారు,? ఆందోళన మూలాలపై ఫోకస్ చేశారు. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను కల్పించారు. పారామిలిటరీ బలగాలు కూడా హస్తినలో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.ఢిల్లీలోని తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ వివరించనున్నారు. పరిస్థితిని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో తెలియజేస్తారు.