ఇన్నాళ్లూ ఎన్నికల హడావుడిలో మునిగి తేలి..ఇక కరోనాపై: మంత్రులతో టాస్క్‌ఫోర్స్

Politics Published On : Thursday, March 19, 2020 08:37 AM

అమరావతి: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు రోజురోజుకూ తీవ్రమౌతున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీలో ఈ వైరస్ తీవ్రత భయపడేంత స్థాయిలో లేదనేది అధికార వర్గాల వాదన. అయినప్పటికీ, కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది, ఆలస్యంగానైనా. దీనికోసం కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి అన్ని రకాల ముందుజాగ్రత్తలను చేపట్టింది.