వారికి అదే చివరి రోజు: చంద్రబాబు వార్నింగ్
సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేసేవారికి అదే చివరి రోజు అని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన దగ్గర ఎవరి ఆటలు సాగవని అన్నారు.
`కోవర్టులను పార్టీలోకి పంపాలనుకుంటే మీ ఆటలు సాగవు. వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు చెబుతున్నా. నేరస్తులు చేసే కనికట్టు మాయపై అందరూ జాగ్రత్తగా ఉండండి." అంటూ సలహా ఇచ్చారు.