బీజేపీ ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ ఎంక్వెరీపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజ్ ఆయన మీడియాతో మాట్లాడుతూ `కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యాను. ఆనాటి ఆర్థికశాఖ మంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను,అందులో నా పాత్రను కమిషన్ ఎదుట వివరించాను. KCR ను రక్షించాల్సిన అవసరం నాకు లేదు. కావాలనే కాంగ్రెస్ మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కామెంట్ చేస్తున్నారు' అని ఎంపీ మండిపడ్డారు. కమిషన్ ముందుకు రాజకీయ ప్రకటన చేయడానికి వెళ్లలేదని అన్నారు.