ఎవరు...ఎక్కడ ???

Offbeat Published On : Friday, December 7, 2018 11:45 AM

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకోగా, కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్,  నటులు చిరంజీవి, నితిన్, అల్లు అర్జున్, అక్కినేని నాగర్జున, అమల, వన్డే నవీన్ తదితరులు జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో ఓటేశారు. అలాగే, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, జీహెచ్ఎంసీ కమిషన్ దానకిశోర్, పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.