ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్
భారత్- పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, పలు ఐటి కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఛండీగఢ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించాయి. HCLటెక్, డిలైడ్ వంటి ప్రముఖ సంస్థలు ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూడడం మంచిదని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.