ఉగ్రదాడి ఎఫెక్ట్.. నిలిచిపోయిన పెళ్లి
పహల్గామ్ ఉగ్రదాడితో ఓ వివాహం నిలిచిపోయింది. రాజస్థాన్ కు చెందిన షాతన్ సింగ్ కు పాకిస్థాన్ కు చెందిన హిందూ యువతితో వివాహం జరగాల్సి ఉంది. అయితే భారత్ తాజాగా పాకిస్తాన్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంది. దీంతో వాఘా - అట్టారి బార్డర్ మూసివేయగా అక్కడకు వెళ్లలేక పెళ్లి ఆగిపోయింది. కాగా పాక్ తో సరిహద్దు పంచుకునే రాజస్థాన్ గ్రామాల ప్రజలకు ఆ దేశంలో బంధువులున్నారు. నేటికీ వారు సంబంధాలు ఏర్పర్చుకుంటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారనుంది.