నా భర్త ఆరోగ్యం క్షీణించింది: వల్లభనేని వంశీ భార్య
గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. మరోవైపు వంశీ అస్వస్థతకు గురికావడంతో విచారణకు కొంత ఆటంకం కలిగిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. కస్టడీ అనంతరం వంశీని కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన భార్య పంకజ శ్రీ మీడియాతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన 105 కేజీల నుంచి 85 కేజీలకు అంటే 20 కేజీల బరువు తగ్గిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.