Breaking: వల్లభనేని వంశీకి సీరియస్

News Published On : Saturday, May 3, 2025 10:31 PM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని పోలీసులు విజయవాడ సబ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. బ్యాక్ పెయిన్, కాళ్లు వాయడంతో వెంటనే విజయవాడ ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకెళ్లారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.