మరోసారి భీకర దాడులు
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు. తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్పై డ్రోన్లు దాడి చేయడంతో మంటలు చెలరేగాయాని తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.