టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని అధికారులు సూచించారు. కాగా మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి టీటీడీ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది.