విమాన ప్రమాదం.. మొత్తం మృతుల సంఖ్య ఇదే..
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో విమానంలోని 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పేర్కొంది.
ఈ ఘటనలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడా వాసి మృతి చెందారు. అదే ప్రమాదంలో విమానం కూలిన భవనంలో ఉన్న 24 మంది మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు.