ఏపీ భవన్ కు బెదిరింపులు

News Published On : Saturday, May 3, 2025 01:31 PM

ఢిల్లీలోని ఏపీ భవన్ కు గుర్తు తెలియని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఏపీ భవన్ ను పేల్చేస్తామంటూ మెయిల్ ద్వారా అధికారులకు నిందితులు సందేశం పంపారు. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు ఢిల్లీ ఏపీ భవన్ లో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించి ఫేక్ సమాచారంగా అధికారులు తేల్చారు. ఇదే క్రమంలో మెయిల్ పంపిన నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏపీ భవన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఢిల్లీలోని సీనియర్ అధికారుల కోసం ‘‘పూలే’’ సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఏపీ భవన్ లో కలకలం రేగింది. డాగ్ స్క్వాడ్ తనిఖీల తర్వాత బాంబు లేదని తేలడంతో ఏపీ భవన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...