సుప్రీంకోర్టులో టెలికాం సంస్థలకు చుక్కెదురు
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిల నుండి ఊరట కల్పించాలంటూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వోడాఫోన్, ఐడియా షేర్లు కుప్పకూలాయి. ఈ మేరకు నేడు ఇంట్రాడేలో వీఐ షేర్లు 10 శాతం క్షీణించాయి. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో NSEలో షేర్లు 8.28 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.