నీట్ పరీక్షలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

News Published On : Friday, May 30, 2025 05:00 PM

నీట్ పీజీ పరీక్షలు ఒకే షిఫ్ట్ లో నిర్వహించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రెండు షిఫ్ట్ లలో పరీక్ష నిర్వహించడం సరికాదని స్పష్టం చేసింది. ఇటీవల నీట్ పీజీ 2025 కోసం రెండు షిఫ్ట్ పరీక్షల ఫార్మాట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కాగా జూన్ 15న దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.