ఈడీ ముందుకు సుజనా చౌదరి

News Published On : Monday, December 3, 2018 09:47 PM

సుమారుగా 5,700 కోట్ల రుపాయలను బ్యాంకులకు మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. గత నవంబర్ 24 నుండి ఆయన నివాసం మరియు పలు కంపెనీలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్వతహాగా విచారణగా హాజరు కావాలని నవంబరు 27న సమన్లు కూడా జారీ చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ సుజనా చౌదరి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఫలితం దక్కలేదు. దాంతో ఆయన నేడు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. చెన్నైలోని ఈడీ కార్యాలయంలో ఆయన్ను పలు అంశాలకు సంభందించి సుమారుగా 5 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.