హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర
బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ మూడో రోజైన ఆదివారం పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. వీళ్లిద్దరికీ వివిధ కోణాల్లో విచారణ సాగినట్లు సమాచారం.
గత 6 నెలలుగా హైదరాబాద్లోనే సమీర్ తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు ఏడు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం.