రేపు మరో కుట్రను బయటపెడతానంటున్న శివాజీ

News Published On : Saturday, April 6, 2019 02:04 PM

ఆంధ్రప్రదేశ్‌పై చాలా కుట్రలు జరుగుతున్నాయని హీరో శివాజీ మందిపడ్డారు. ఈ నాలుగు రోజుల్లోనే చాలా కుట్రలు జరగబోతున్నాయని అయన వెల్లడించారు. ఈ కుట్రలేంటో రేపు ఉదయం ఆధారాలతో సహా మీడియా ముందు పెడతానని శివాజీ స్పష్టంచేశారు. ఎలక్షన్ ముందు రాష్ట్ర చీఫ్ సెక్రటరీని మార్చడం కంటే దారుణం ఏముంటుందని శివాజీ ప్రశ్నించారు. ఇది కచ్చితంగా మోదీ కుట్రేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు, మోడీ ఎలా చెప్తే ఆలా ఎలక్షన్ కమిషన్ ఆడుతుంది అని అన్నారు.

మోడీ మరియు జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ పైన చాలా కుట్రలు చేస్తున్నారు అని, ఈ కుట్రలను అన్ని రేపు (07 ఏప్రిల్ 2019) న ఆధారాలతో సహా బయటపెడతాను అని శివాజీ అన్నారు.