డిగ్రీ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. తొలివిడతలో 89,572 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 65, 191 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు విద్యా మండలి చైర్మన్ వి బాలకిష్టారెడ్డి తెలిపారు. తొలి విడతలో కామర్స్ వైపే మొగ్గు చూపించినట్లు అధికారులు తెలిపారు. కామర్స్ లో 21,758 మంది సీట్లు సాధించారని.. రేపటి నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు జరగనుందని పేర్కొన్నారు.