ఓబులాపురం మైనింగ్ నిందితులకు ఊరట
ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగియగా నేడు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశం విడిచి వెళ్ళరాదని, రూ.10లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని తెలిపింది.