రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ జారీ
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ పై మెరుపు దాడులు చేసి గట్టి ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసినందుకు భారత రక్షణ శాఖ వెల్లడించింది. దీంతో పాక్ తిరిగి దాడులు జరిపే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు హై అలెర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.