ఇకపై రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు బంద్
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో సంస్థలు తమ సేవలను నేటి నుంచి నిలిపి వేశాయి. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అంశంపై క్యాబ్ సర్వీస్ సంస్థలు సవాల్ చేయగా.. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్ధించడంతో సేవలు నిలిచిపోయాయి.