ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు
తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ మంగళహాట్ పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం సెక్యూరిటీతో మాత్రమే బయటికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాజాసింగ్ భద్రత దృష్ట్యా ఇప్పటికే ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తో పాటు 1+4 భద్రతను కేటాయించింది. అయితే రాజాసింగ్ తమ సూచనలను పట్టించుకోవడంలేదని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించడం లేదని పోలీసులు చెబుతున్నారు.