విజయవంతంగా భూ వాతావరణంలోకి POEM-4
పీఎస్ఎల్వీ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM-4) విజయవంతంగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, హిందూ మహాసముద్రంలో పడినట్లు ఇస్రో వెల్లడించింది. తద్వారా అంతరిక్ష వ్యర్థాలను నియంత్రించే ప్రయాణంలో మరో కీలక ముందడుగు వేసినట్లు పేర్కొంది. ఇస్రో గతేడాది డిసెంబరు 30న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సి60ని ప్రయోగించి, స్పేడెక్స్ ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.