చంద్రబాబుకు గవర్నర్ ఫోన్...
పెథాయ్ తుఫాను దృష్ట్యా చేపట్టిన ముందస్తు చర్యల గురించి ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం చంద్రబాబుకు గవర్నర్ సూచించారు.