పేటియం యూజర్లకు గుడ్ న్యూస్: రూ.7500 క్యాష్ బ్యాక్!

News Published On : Saturday, January 19, 2019 03:32 PM

భారతదేశపు మొబైల్ యాప్ ఆధారిత లావాదేవీలు నిర్వహించే పేటిఎం దిగ్గజం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుని పేటీఎం యాప్ ద్వారా నగదును చెల్లించేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 7500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని పెటీఎంప్రకటించింది. 
రూ.7,500 క్యాష్‌బ్యాక్ పొందేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి

  • పేటీఎం ఎంపిక చేసిన బంక్‌లోనే పెట్రోల్ పోయించుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • ఆఫర్‌లో ఉన్న బంక్‌ల పేర్లు తెలుసుకోవడం కోసం పేటీఎం యాప్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
  • కనీసం రూ. 50 పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకున్న వారికే ఈ ఆఫర్ లభిస్తుంది.
  • ఈ ఆఫర్ 2019 ఆగస్టు 1న ముగుస్తుంది.

ఈ ఆఫర్ ఎలా పొందాలి?

  • ఇంధనం పోయించుకున్న తర్వాత పేటీఎం యాప్ ద్వారా మాత్రమే చెల్లింపులు జరపాలి. 
  • తర్వాత వినియోగదారుడికి పేటీఎం నుంచి మెసేజ్ వస్తుంది, మెసేజ్‌పైన క్లిక్ చేస్తే అందులోని లింక్ డైరక్ట్‌గా పేటీఎంలోని క్యాష్ బ్యాక్ ఆఫర్ల విభాగంలో ఓపెన్ అవుతుంది.
  • దీంతో మీరు చేసిన మెుదటి లావాదేవి యాప్ ద్వారా ధృవీకరించబడుతుంది.
  • 48 గంటల్లోపు SMS ద్వారా నమోదు చేసిన నంబర్‌కి ప్రోమో కోడ్లను పొందుతారు. 
  • ఈ ప్రోమో కోడ్‌ను తదుపరి జరిపే లావాదేవికి ఉపయోగించుకోవచ్చు.
  • ఇలా దాదాపు రూ 7500 వర్త్ గల ప్రోమో కోడ్‌లను పొందవచ్చు.
  • పేటీఎం యాప్ ద్వారా చేసే 11వ 21వ 31వ 41వ ట్రాన్సాక్షన్ ద్వారా పుల్ క్యాష్ బ్యాక్‌ వస్తుంది.