సైనిక కాన్వాయ్ పై దాడి.. 32 మంది పాక్ సైనికులు మృతి

News Published On : Sunday, May 25, 2025 02:00 PM

భారత్ ప్రతి దాడి నుండి కోలుకోక ముందే పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ మేరకు బలూచిస్తాన్ లో సైనిక కాన్వాయ్ పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేపై ఆపి ఉంచి ఉన్న కారులోని పేలుడు పదార్థం పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.