మరో 4 రోజుల్లో యుద్ధం: పాక్ ఢిఫెన్స్ మినిస్టర్
భారత్ యుద్ధానికి వస్తే తాము అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే యుద్ధం తప్పేలా లేదని వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి, తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నా భారత్ వినడం లేదని ఆయన ఆరోపించారు. పాక్ లో లష్కరే తోయిబా సంస్థ ఎప్పుడో నిర్వీర్యం అయిపోయిందని.. అసలు ఉగ్రవాదానికి అందరికంటే తామే ఎక్కువ బలౌతున్నామని చెప్పుకొచ్చారు.