ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం. ఒక్కరోజులో 67 కొత్త కేసులు..!
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 111కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 67 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 12 గంటల్లో మొత్తం 520 శాపిళ్లను పరీక్షించగా 67 పాజిటివ్గా, 443 నెగిటివ్గా నమోదయ్యాయి. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పెనుగొండలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పెనుగొండను రెడ్జోన్గా ప్రకటించారు. దీంతో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు బుధవారం పెనుగొండలో ప్రభుత్వ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.