పహల్గామ్ ఉగ్రదాడిపై NIA నివేదిక
పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఒక నివేదికలో పొందుపరిచి, విడుదల చేసింది. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ISI తో పాటు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు హష్మీ ముసా అలియాస్ సులేమన్, అలీ బాయ్లుగా వీరిని NIA గుర్తించింది.