కోటి ఆశలతో బయదేరింది.. అంతలోనే ఘోరం
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గమ్య స్థానాలకు చేరాల్సిన ఎంతో మంది కలల్ని చిదిమేసింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్ కు చెందిన కుష్బూ కూడా దుర్మరణం పాలైంది. కాగా కుష్బూకు ఇటీవలే పెళ్లైంది. ఆమె భర్త లండన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తుండగా తనని కలిసేందుకు కోటి ఆశలతో బయలుదేరింది. అంతలోనే విమాన ప్రమాద రూపంలో మృత్యువు ముంచుకొచ్చి భర్తను కలవకుండానే కన్నుమూసింది.