నేడు అకౌంట్లోకి రూ.20,000 జమ
నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం రూ.258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. ఈరోజు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నగదు జమ చేయనున్నారు.