లెక్చరర్ల నియామక కొత్త పరీక్ష షెడ్యూల్ విడుదల
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఏపీపీఎస్సీ జూనియర్, డిగ్రీ లెక్చరర్ల నియామక పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ రాస్తున్న కొందరు అభ్యర్థులు ఈ పరీక్షలు కూడా రాస్తుండడంతో ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. అయితే తాజాగా పరీక్షలకు సంబంధించి కొత్త పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జూలై 15 నుంచి 23 వరకు జరగనున్నాయి.