ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. లోకేష్ దిగ్భ్రాంతి
అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్యకు గురైంది. అమ్మాయికి హత్య చేసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన్మయి హత్య తీవ్రంగా కలిచివేసినట్లు తెలిపారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగబెట్టడం షాక్ కు గురి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు. తన్మయి హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేష్ తెలిపారు.