ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: మోడీ
'ఆపరేషన్ సిందూర్' ఇంకా ముగియలేదని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. 'సిందూర్ ఆపరేషన్ ఇంకా పూర్తికాలేదని బెంగాల్ గడ్డ మీద నిలబడి, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నాను. సిందూరం శక్తి ఏంటో మన ఆర్మీ ఉగ్రవాదులకు రుచి చూపించింది. మనం వారి ఇంట్లోకి ప్రవేశించి, మూడుసార్లు దాడులు చేశాం.. పాకిస్థాన్ అర్థం చేసుకోవాలి' అని ప్రధాని అన్నారు.