మోడీకి అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోడీ ప్రస్తుతం ద్వీప దేశమైన సైప్రస్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం అయిన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3' ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య సంస్కృతి, సోదరభావం, వసుదైక కుటుంబం భావనకు ప్రతీక అని అన్నారు.