నేటి నుంచి మెగా డీఎస్సీ.. నిబంధనలు ఇవే..
ఏపిలో మెగా DSC 2025 ఆన్లైన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుండి 30 వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని DSC కన్వినర్ ప్రకటించారు. హాల్ టికెట్ పై ఫొటో లేకపోతే రెండు పాస్పోర్ట్ ఫొటోలు తీసుకురావాలి.
హాల్ టికెట్ లో పొరపాట్లు ఉంటే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులు చూపించాలి. మొత్తం 12 పట్టణాల్లో ఉదయం 9:30-12 వరకు, 2:30-5 గంటల వరకు పరీక్ష ఉండనుంది.