వణికిస్తున్న మెదడువాపు వ్యాధి, 54 మంది చిన్నారులు మృతి..!

News Published On : Friday, June 14, 2019 02:00 PM

మెదడువాపు వ్యాధి చిన్నారులకు ఇది ఒక పెద్ద శాపం, ఇప్పుడు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి బారినపడి చికిత్స పొందుతూ గురువారం ఒక్కరోజే ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మెదడువాపు వ్యాధితో మరణించినవారి సంఖ్య 54కు చేరింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి, గాలిలో తేమశాతం అధికమవడంతో మెదడువాపు వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. గత వారం ఒక్కరోజే మెదడువాపు లక్షణాలతో 21మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరగా, ఈ వరం మరో 14 మంది కేజ్రీవాల్ ఆస్పత్రిలో చేరారు.

కాగా, ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. మెదడువాపు వ్యాధిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో చికిత్స అందుంతుందని వెల్లడించారు.