ఘోర అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సోలాపూర్ ని టెక్స్టైల్ మిల్లులో భారీగా మంటలు చెలరేగడంతో యజమాని సహా 8 మంది మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. భారీగా మంటలను అదుపు చేసేందుకు 6 గంటలు కష్టపడ్డట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.