మరో భారీ భూకంపం.. ధ్వంసమైన బిల్డింగులు
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురై తమ ఇళ్లను వదిలి పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆ నగరం అంతటా సైరన్లు మోగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవు.