270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం
భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ముఖ్యమైన ఆలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో విష్ణువు స్వరూపంతో భక్తులను దర్శనమిస్తున్నారు. అయితే 270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు విష్ణు నామస్మరాలతో మారుమ్రోగాయి. అలాగే ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరం పై మూడు కలశాలను ప్రతిష్టించారు. అనంతరం విశ్వక్సేసుని విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.