నివాసంలో దూరిన జంతువు, బయటకు రావొద్దు: పోలీసులు

News Published On : Monday, March 30, 2020 03:28 PM

చండీగఢ్ సెక్టార్ 5 నివాస ప్రాంతంలో చిరుతపులి లాంటి జంతువు కనిపించింది. దీంతో అక్కడున్న స్థానికుల గుండె గుబేల్ మంది. చిరుతపులి లాంటి జంతువు ఉన్నందున.. జనం ఇంట్లోంచి బయటకు రావొద్దని పోలీసులు కోరారు. ఆ జంతువు కచ్చితంగా చిరుతపులి అని పోలీసులు అంటుండగా.. వన్యప్రాణి కార్యకర్తలు మాత్రం విభేదిస్తున్నారు.

సోమవారం ఉదయం చిరుతపులి లాంటి జంతువు కనిపించింది.దీంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ జంతువుని పట్టుకోవడానికి వల పన్ని ప్రయత్నిస్తున్నారు.