సత్యసాయి జిల్లాలో చిరుత కలకలం

News Published On : Sunday, May 25, 2025 01:14 PM

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అగలి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజులుగా గాయత్రి కాలనీలో చిరుత సంచరించడాన్ని పలువురు ప్రజలు గమనించారు. అంతేకాకుండా చిరుత పులి రెండు రోజుల క్రితం గొర్రెల మందపై దాడి చేసి వాటిని గాయపరిచింది. ఈ మేరకు స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా చిరుతను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు.