వెంకటప్ప మెమోరియల్ పాఠశాల గురించి తెలుసుకుందామా?

News Published On : Friday, December 14, 2018 07:55 PM

పులివెందులలో వైయస్ జగన్ గారు పైసా డబ్బు తీసుకోకుండా రెండు పెద్ద పాఠశాలలను నడుపుతూ దాదాపు 2500 పైగా పేద విద్యార్థులకు విద్యను అందజేస్తున్నారు. యూనిఫామ్ మరియు పుస్తకాలు కూడా ఉచితంగా అందిస్తున్నారు..

మొదటిది తన తండ్రి YSR గారు వారి గురువుగారి పేరు మీద కట్టించిన G.వెంకటప్ప మెమోరియల్ పాఠశాల.ఈ పాఠశాల గత పది సంవత్సరాల నుండి నడుపుతున్నారు.

రెండవది జగన్ గారు ఎన్నికల ప్రచారంలో ఒక మానసిక వికలాంగురాలు విజేత అనే అమ్మాయి బాధను గమనించిన ఆ అమ్మాయి పేరు మీదుగా వికలాంగులకు ప్రత్యేక పాఠశాల కట్టించి సేవలు అందిస్తున్నారు.

ఇవే కాకుండా పులివెందులలో వృదులకు వృదాశ్రమం , మహిళల స్వయం ఉపాధి కల్పనకు ఆశ్రమం కట్టించి నడుపుతున్నారు.

అలాగే పులివెందుల నియోజకవర్గం లో అనేక దేవాలయలకు విరాళాలు ఇచ్చారు..కొన్ని దేవాలయాలు స్వయంగా నిర్మించారు.