రైతుల ఖాతాల్లో డబ్బులు... ఎప్పుడంటే..
కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసే కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈ నెలలోనే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నదాతలకు కేంద్రం 3 విడతల్లో రూ.6 వేల సాయం అందిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాదికి తొలి విడత రూ.2వేలు ఫిబ్రవరి 19న జమ చేయగా రెండో విడత సొమ్మును ఈ నెల మూడో వారంలో జమ చేయనున్నట్లు సమాచారం. కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.