రైతులకు గుడ్ న్యూస్
రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. వ్యవసాయ రుణాలపై రైతులకు అందించే వడ్డీ రాయితీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యధావిధిగా కొనసాగించబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం 15,642 కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం. పంట సాగు కోసం మూడు లక్షల వరకు ఇవ్వనుంది. అదే సమయంలో అనుబంధ కార్యకలాపాల కోసం రెండు లక్షల రుణం తీసుకోవచ్చు.