హైదరాబాద్ లో రూ.150 కోట్ల భారీ స్కామ్
హైదరాబాద్లో మరో భారీ స్కామ్ బయటడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. మొత్తం 1500 మంది వరకు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. చివరికీ ఇది బోగస్ కంపెనీ అని. తాము మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పెద్దఎత్తున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.