రాజీవ్ యువ వికాసంపై కీలక అప్డేట్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం ఉపాధి పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా మైనార్టీ, BC, ST, SC వర్గాల నుంచి తీవ్ర పోటీ నెలకొందని తెలిపింది. యాదాద్రి జిల్లాలో 39,141 దరఖాస్తులందగా,7041 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపింది. ఈ జిల్లాలో బ్యాంక్ వెరిఫికేషన్ పూర్తి అవ్వగా.. నెలాఖరులో లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 1 - 9 వరకు ప్రొసీడింగ్స్ అందించనున్నారని పేర్కొంది.