ఏపిలో భారీగా మారణాయుధాలు లభ్యం
ఏపీలోని పల్నాడు జిల్లాలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల రూరల్ శిరిగిరిపాడులో ఈరోజు ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించగా కొందరి ఇళ్లలో భారీగా మారణాయుధాలు లభ్యం అయ్యాయి. శిరిగిరిపాడులో వారం క్రితం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. ఇరు పార్టీల కార్యకర్తల వద్ద కొడవళ్ళు, కత్తులు,గొడ్డళ్లు, 21 బరిసెలు, 20 ఇనుపరాడ్లు, 16 కర్రలు, 13 బస్తాలలో రాళ్ళు, కారం కలిపిన నీళ్లున్న 8 సీసాలను గుర్తించారు.