ప్రభుత్వ పథకంపై ఆశలు ఆవిరి

News Published On : Saturday, June 14, 2025 11:21 AM

రాజీవ్ యువ వికాసం ద్వారా ఉపాధి పొందవచ్చని భావించిన నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. జూన్ 2న 50వేల నుంచి లక్షలోపు అర్హులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించి చివరి నిమిషంలో నిలిపివేసింది. ఈనెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ ఎటువంటి స్పష్టత రాకపోవడంతో యువత నిరాశలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,71,116 మంది దరఖాస్తు చేసుకున్నారు.